మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్

సంగారెడ్డి బ్యూరో, ఏప్రిల్ 11(డైలీ రిపోర్ట్):

సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా, సంగారెడ్డి ఎమ్.ఎల్.ఎ క్యాంపు కార్యాలయం ప్రక్కన వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సి. దామోదర రాజనర్సింహ తో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ . ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, జ్యోతిరావు ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన న్యాయవాది అన్నారు. ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం అని, సమానత్వం, న్యాయం మరియు సామాజిక సామరస్యం యొక్క విలువలను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అటువంటి గొప్ప వ్యక్తులకు నివాళులు అర్పించడం అంటే వారి మార్గాన్ని అనుసరించడం మరియు మెరుగైన సమాజం కోసం పనిచేయడమే అని ఎస్పీ  అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!